- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
డబుల్ డెక్కర్ రైలులో మంటలు..
by Vinod kumar |
X
గుడియాత్తం (తమిళనాడు): బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలులో ప్రమాదం జరిగింది. రైలు తమిళనాడులోని గుడియాత్తం రైల్వే స్టేషన్కు చేరుకోగానే మంటలు చెలరేగాయి. మంటలు, పొగలు గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును స్టేషన్లో ఆపేశారు. సమయ స్ఫూర్తి తో రైలు లోకో పైలట్ స్పందించి ట్రైన్ను ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంజన్లో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని గుర్తించారు. దాదాపు రెండు గంటలపాటు రైలును స్టేషన్లోనే నిలిపివేశారు. సాంకేతిక లోపాలను సరిచేసిన తర్వాత రైలు చెన్నైకు బయలుదేరింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రైలులో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. రైల్వే సిబ్బంది అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Next Story