Samajwadi Party : కశ్మీర్ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ

by Hajipasha |
Samajwadi Party : కశ్మీర్ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగబోయే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి తమ మద్దతు ఉంటుందని వెల్లడించింది. ఈమేరకు సమాజ్‌వాదీ పార్టీ జమ్మూకశ్మీర్ విభాగం అధ్యక్షుడు జియా లాల్ వర్మ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

జమ్మూకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగానూ 51 చోట్ల నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులు, 32 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఐదు స్థానాల్లో ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా తలపడనున్నాయి. ఇదే కూటమిలోని సీపీఎం, పాంథర్స్ పార్టీలకు చెరొక సీటును కేటాయించారు.

Advertisement

Next Story

Most Viewed