Ravishankar Prasad: ప్రసాదంలో కల్తీ జరగడం సిగ్గుపడాల్సిన విషయం: రవిశంకర్ ప్రసాద్ హాట్ కామెంట్స్

by Shiva |
Ravishankar Prasad: ప్రసాదంలో కల్తీ జరగడం సిగ్గుపడాల్సిన విషయం: రవిశంకర్ ప్రసాద్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati) శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ల్యాబ్ రిపోర్టులతో సహా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకులు (Political Leaders), సెలబ్రిటీ (Celebrities)లు జరిగిన ఘటనపై సోషల్ మీడియా (Social Media) వేదిక తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Former Union Minister Ravi Shankar Prasad) తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఘాటుగా స్పందించారు.

కోట్లాది మంది ఆరాధ్య దైవం అయిన శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరగడం సిగ్గుపడాల్సిన విషయమని ఫైర్ అయ్యారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన భావాలతో ఆటలాడటం అంత మంచిది కాదని హితువు పలికారు. ఏకంగా స్వామి వారి ప్రసాదమే కల్తీ జరగడం మహా పాపమని, ఈ విషయంలో యావత్ దేశం అంతా ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని అన్నారు. తిరుపతి బాలాజీ (Tirupati Balaji) సమాజంలో అన్ని వర్గాలు కొలిచే దేవుడని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed