Rajasthan Train Derailment : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

by Rajesh |
Rajasthan Train Derailment : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి హర్యానాలోని రెవరీ సిటీకి ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. జైపూర్ ఏడీఆర్ఎం మనీష్ గోయల్ మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పిందన్నారు. అయితే ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగలేదని ఆయన వెల్లడించారు. త్వరతగతిన గూడ్స్ రైలుకు మరమ్మతులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed