- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
నేను “రెడ్ డైరీ” బయటపెడితే సీఎం జైలుకే.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్
జైపూర్ : రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్ గూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన వెంటనే.. తనను మంత్రి పదవి నుంచి తప్పించిన సీఎం అశోక్ గెహ్లాట్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కన్నీళ్లుపెడుతూ మీడియాతో మాట్లాడిన రాజేంద్ర సింగ్ గూడా.. “రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న చీకటి వ్యాపారాలపై నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఆ మొత్తం చిట్టా నా చేతుల్లో ఉంది. దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన చీకటి దందాపై నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది” అని ఆరోపించాడు. “కాంగ్రెస్ నాయకుడు ధర్మేంద్ర రాథోడ్పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) రైడ్స్ జరిగిన టైంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశాల మేరకు నేను ఒక “రెడ్ డైరీ”ని దాచాను.
అప్పుడు సీఎం గెహ్లాట్ నాకు ఫోన్ చేసి ‘రెడ్ డైరీ’ని ఎలాగైనా దాచమని చెప్పారు. ఆ డైరీని తగులబెట్టారా..? లేదా..? అని ఆ తర్వాత ముఖ్యమంత్రి నన్ను పదే పదే అడిగారు. అందులో భయపెట్టే అంశాలే లేకుంటే సీఎం గెహ్లాట్ అలా మాట్లాడి ఉండేవారు కాదు” అని రాజేంద్ర సింగ్ గూడా కామెంట్ చేశారు. అవినీతి కేసుల వివరాలతో కూడిన ఆ “ఎరుపు డైరీ” తన దగ్గరే ఉందన్నారు. ఆ డైరీని తాను బయటపెడితే సీఎం గెహ్లాట్ జైలుకు వెళతారని ఆయన వివాదాస్పద వ్యాఖ్య చేశారు.