Manipur : మణిపూర్‌ పర్యటనకు రాహుల్..

by Vinod kumar |
Manipur : మణిపూర్‌ పర్యటనకు రాహుల్..
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. పర్యటనలో భాగంగా ఇంఫాల్, చురచంద్‌పూర్‌లలోని పౌరసంఘం ప్రతినిధులతో రాహుల్ మాట్లాడనున్నారు. అలాగే, సహాయక శిబిరాలను సందర్శించనున్నారు. కాగా, మణిపూర్‌లో కొంతకాలంగా హింసాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కుకీలు, మెయిటీలకు మధ్య రిజర్వేషన్ల అంశంపై మొదలైన వివాదం.. హింసాత్మకంగా మారింది.

Advertisement

Next Story