Pm modi: ఈ నెల 19న శ్రీనగర్‌లో మోడీ పర్యటన.. ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న పీఎం

by vinod kumar |
Pm modi: ఈ నెల 19న శ్రీనగర్‌లో మోడీ పర్యటన.. ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న పీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 19న జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. ప్రజలు మోడీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. గురువారం జరిగే ర్యాలీ అతి పెద్ద ఎన్నికల ర్యాలీ అవుతుందని వెల్లడించారు. బహిరంగ సభ అనంతరం మోడీ 19 మంది బీజేపీ అభ్యర్థులతో సమావేశమవుతారని తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ఏడాది మోడీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించడం ఇది మూడో సారి అవుతుందని తెలిపారు. అంతకుముందు సెప్టెంబర్ 14న కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. బుధవారం మొదటి దశ, సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న తుది దశ పోలింగ్ నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed