- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఢిల్లీలో మరోసారి కలకలం..15 మ్యూజియంలకు బాంబు బెదిరింపులు
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని 15 మ్యూజియంలకు తాజాగా బాంబు హెచ్చరికలు వచ్చినట్టు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ మెయిల్స్ ద్వారా వార్నింగ్స్ వచ్చినట్టు వెల్లడించారు. దీనిపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆయా మ్యూజియంలలో బాంబ్ స్వ్కాడ్తో తనిఖీలు చేశారు. అయితే సోదాల్లో భాగంగా ఎటువంటి అనుమానిత వస్తువులు లభించలేదు. దీంతో బెదిరింపులు బూటకమని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు చెప్పారు. కాగా, ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆస్పత్రులతో సహా విమానాశ్రయాలకు సైతం వార్నింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
Advertisement
Next Story