- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తాం : ఆప్
చండీగఢ్ : ఓ వైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ‘ఇండియా’ కూటమిని ఫాలో అవుతుంటే.. మరోవైపు పంజాబ్లోని ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అన్మోల్ గగన్ మాన్ రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేస్తామని ప్రకటించారు. పంజాబ్లో పొత్తులు ఉండవని, మొత్తం 13 లోక్ సభ స్థానాల్లో తాము పోటీ చేసి తీరుతామని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్తో పొత్తులు కుదిరే అవకాశాలు లేవన్నారు. ‘‘జాతీయ స్థాయిలో పొత్తులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. పంజాబ్లో మాత్రం ‘ఇండియా’ లేదు. అన్ని లోక్ సభ స్థానాల్లో మేమే బరిలోకి దిగుతాం’’ అని అన్మోల్ గగన్ మాన్ కామెంట్ చేశారు.
దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆప్తో పొత్తు ఉండదన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. ఈ అంశాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పంజాబ్లోని అన్ని లోక్సభ స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలని తమకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే సూచించారని పేర్కొన్నారు.