- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సామూహిక వివాహ వేడుకలో ఆ శారీలో స్పెషల్ అట్రాక్షన్గా నీతా అంబానీ(ఫొటోస్ వైరల్)
దిశ,వెబ్డెస్క్: వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి సమయం తక్కువగా ఉంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్తో జులై 12 వ తేదీన వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తన కుమారుడి పెళ్లి వేడుకల్లో భాగంగా ముఖేశ్ అంబానీ ముంబైలో 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ గురించి ఓ టాపిక్పై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. సందర్భానికి తగ్గట్టు చీరలు, నగలు, అలంకరణలో ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీది అందేవేసిన చేయి. పట్టు చీరలు, స్వదేశీ నేత శారీలు అంటే ఆమెకు మక్కువ. ఈ కార్యక్రమానికి హాజరైన నీతా అంబానీ ధరించిన చీరపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..ఆమె ధరించిన ఎరుపు రంగు శారీ పై బంగారు వర్ణంలో పవిత్ర గాయత్రి మంత్రాన్ని ముద్రించారు. గాయత్రి మంత్రంతో పాటు మరిన్ని వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం ఆమె ధరించిన ఎరుపు రంగు చీర సోషల్ మీడియాలో వైరల్గా మారింది.