నా కూతురిలో మా అమ్మను చూసుకున్నా.. కన్నీళ్లు పెట్టిస్తోన్న రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |
నా కూతురిలో మా అమ్మను చూసుకున్నా.. కన్నీళ్లు పెట్టిస్తోన్న రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరో, విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ గారాలపట్టి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు నిన్న హైద్రాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(శనివారం) మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గతంలో ‘బేవర్స్’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “అమ్మలేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు. నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. నేను కూడా నా కూతురిలో మా అమ్మను చూసుకున్నా.. కానీ, ఇప్పుడు ఆ కూతురి మాటలు లేవు. ఆమె ప్రేమించిన వాడితో వెళ్లి పోయింది. అయితే ఈ సినిమాలోని అమ్మ పాటను నా కూతురిని ఇంటికి పిలిపించి మరీ నాలుగు సార్లు వినిపించాను” అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కాగా ఈ రోజు అమ్మ అనుకున్నటువంటి కూతురు కూడా కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed