ఇటీవలే రామోజీరావు హెల్త్ గురించి మోడీ అడిగారు: నిర్మలా సీతారామన్

by Satheesh |   ( Updated:2024-06-08 12:59:52.0  )
ఇటీవలే రామోజీరావు హెల్త్ గురించి మోడీ అడిగారు: నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి పట్ల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతాపం తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే రామోజీ రావు ఆరోగ్యం గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రామోజీ రావు మరణం తెలుగు జాతికి చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తరుఫున రామోజీ రావు మృతికి సంతాపం తెలిపాలని మోడీ సూచించారని నిర్మలా వెల్లడించారు. రామోజీ కుటుంబానికి సంతాప సందేశం అందించాలని చెప్పారన్నారు. కాగా, గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యం బాధపడుతోన్న రామోజీ రావు.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజూమున కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story