ఏడాదిలోపే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుంది: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

by vinod kumar |
ఏడాదిలోపే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుంది: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఏడాదిలోపే కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఎన్డీయే మిత్రపక్షాల అంచనాలను అందుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు మాత్రమే కొనసాగుతుంది. అంతకంటే ఎక్కువ కాలం ఉండదు అని చెప్పారు. భాగస్వామ్య పార్టీలు ఆశించిన విధంగా మోడీ పనిచేయబోడని, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే తన వైఖరిని ఆయన కొనసాగిస్తారని తెలిపారు. టీడీపీ, జేడీయూ పార్టీలే స్పీకర్‌ను తయారు చేసుకోవాలని లేదంటే ఈ రెండు పార్టీల నుంచి ఎంతమంది బీజేపీలో చేరుతారో చెప్పలేమన్నారు. ఎన్డీయే కూటమి పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, మోడీ 3.0 ప్రభుత్వం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story