బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో వ్యక్తికి మరణశిక్ష

by S Gopi |
బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో వ్యక్తికి మరణశిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదేళ్ల బాలికపై 2019లో అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి నాగ్‌పూర్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. 2019, డిసెంబర్ 6న కల్మేశ్వర్ తహసీల్‌లోని లింగ గ్రామంలో తలకు బలమైన గాయాలతో బాలిక మృతదేహం లభ్యమైంది. అదే గ్రామంలో వ్యవసాయం పొలంలో బాలిక తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. నోట్లో గుడ్డ ముక్క, రాడ్ కుక్కి ఉండటం, చుట్టూ రక్తపు మడుగులో పడున్న స్థితిలో బాలిక ఉండటం అప్పట్లో అందరినీ కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో చిన్నారిపై అత్యాచారం చేసి, కొట్టి చంపినట్టు తేలింది. సమగ్రమైన దర్యాప్తు అనంతరం అదే పొలంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సంజయ్ పూరీ(32) ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. దాంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 26 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే పోక్సో చట్టం కింద జిల్లా జడ్జి, అదనపు సెషన్స్ జడ్జీ ఎస్ ఆర్ పడ్వాల్ నిందితుడికి మరణశిక్ష విధించారు.

Advertisement

Next Story