- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బీజేపీకి 300కు పైగా సీట్లు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ గెలుచుకోవచ్చని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న సీట్ల కంటే మరికొన్ని సీట్లు ఎక్కువగానే వస్తాయని తెలిపారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ‘బీజేపీ గతంలో కన్న కాస్త మెరుగైన సీట్లు గెలుచుకుని తిరిగి అధికారాన్ని చేపట్టబోతుంది.ఎందుకంటే పశ్చిమ, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు ఏమీ కనిపించడం లేదు. కానీ పలు ప్రాంతాల నుంచి బీజేపీకి మద్దతు లభించింది’ అని తెలిపారు. తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ లేకపోయినప్పటికీ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని అది కాషాయపార్టీకి కలిసి వచ్చే చాన్స్ ఉందన్నారు. కాగా, గతంలోనూ బీజేపీకి 300కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ తెలిపారు.