మోడీ మిత్రపక్షాల మద్దతుతోనే గెలిచారు: గుండు చేయించుకోవడానికి నిరాకరించిన ఆప్ నేత

by vinod kumar |
మోడీ మిత్రపక్షాల మద్దతుతోనే గెలిచారు: గుండు చేయించుకోవడానికి నిరాకరించిన ఆప్ నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని గతంలో శపథం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సోమనాథ్ భారతి తన మాటను నెరవేర్చడానికి నిరాకరించారు. మోడీ సొంతంగా ప్రధాని కాలేదని, మిత్ర పక్షాల మద్దతులో అయ్యారని తెలిపారు. అందుకే తన హామీని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మోడీ మూడోసారి ఎన్నికైతే నేను గుండు కొట్టించుకుంటానని చెప్పాను. అయితే, అతను సొంతంగా గెలవలేదు. కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చాడు. తనంతట తానుగా గెలవకపోతే అది గెలుపు కాదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ..సోమ్ నాథ్ తక్షణమే గుండు కొట్టించుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమనాథ్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story