నేడు ఢిల్లీలోనే ‘ఇండియా’ దిగ్గజ నేతల మకాం.. ఎందుకు ?

by Hajipasha |
నేడు ఢిల్లీలోనే ‘ఇండియా’ దిగ్గజ నేతల మకాం.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మిత్రపక్షాల కీలక నేతలంతా మంగళవారం రాత్రి ఓట్ల లెక్కింపు ముగిసే సమయం నుంచి జూన్ 5వ తేదీన ఉదయం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని విపక్ష ‘ఇండియా’ కూటమి పిలుపునిచ్చింది. విపక్ష కూటమి అంచనాల ప్రకారం ఫలితాలు రాకపోతే కూటమి నేతలంతా కలిసి విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. వారంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పాత్రపై ప్రశ్నలు లేవనెెత్తే అవకాశం ఉంది. ఈవిషయంలో ఇండియా కూటమి పార్టీలతో కలిసి నడిచేందుకు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story