- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కాంగ్రెస్ అభ్యర్థులతో ఖర్గే, రాహుల్ భేటీ..కౌంటింగ్ వ్యూహాలపై కీలక చర్చ!
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఆదివారం భేటీ కానున్నారు. ఈ మేరకు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 1 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నేతలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ మీటింగ్లో ప్రధానంగా జూన్ 4న జరిగే కౌంటిగ్ సన్నద్దతపై పార్టీ అభ్యర్థులకు పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి తమ పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.