Breaking: అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐసీస్ భారీ కుట్ర

by Mahesh |
Breaking: అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐసీస్ భారీ కుట్ర
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉన్న అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించడానికి ఐసీస్ భారీ కుట్రను పన్నింది. ఇందుకోసం బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి ఐఎస్ఐ కుట్ర పన్నింది. ఈ హింసలో ముఖ్యంగా హిందూ నేతలు, బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని విధ్యంసం సృష్టించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ కుట్రకు పంజాబ్ లోని గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులతో కలిసారు. ఇందుకోసం గత నెల 25న పఠాన్ కోట్ పరిసరాల్లో ఉగ్రవాదుల కదలికలు రికార్డయ్యాయి.

దేశంలో విధ్వంసం సృష్టించడానికి జమ్ములో కాశ్మీర్‌లోకి ఏడుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ కుట్ర ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు అమర్‌నాథ్ యాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే జమ్మూలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం అందడంతో వారిని కనిపెట్టేందుకు ఇంటెలిజెన్స్ బృందాలను అప్రమత్తం చేసినట్లు సమాచారం అందుతుంది.



Next Story