Washington: అమెరికాలో రాయబార కార్యాలయ అధికారి అనుమానాస్పద మృతి

by Shamantha N |
Washington: అమెరికాలో రాయబార కార్యాలయ అధికారి అనుమానాస్పద మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత రాయబార కార్యాలయ అధికారి అనుమానాస్పద మృతి చెందారు. వాషింగ్టన్ లోని మిషన్ ప్రాంగణంలో అధికారి మృతదేహం లభ్యం అయ్యింది. స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అధికారి సూసైడ్ చేసుకున్నాడా లేదా హత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇకపోతే, ఇండియన్ ఎంబసీ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. " సెప్టెంబర్ 18న భారత రాయబార కార్యాలయ అధికారి మరణించాడని విచారంతో తెలియజేస్తున్నాం. డెడ్ బాడీని తిరిగి భారత్ పంపించేందుకు సంబంధిత ఏజెన్సీలు, కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని ప్రకటనలో పేరొంది. మృతుడి కుటుంబ గోప్యత కోసం మరణించిన వారి అదనపు వివరాలను తెలియజేయట్లేదని వెల్లడించింది. అధికారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

Next Story

Most Viewed