విజయానికి చేరువలో ఇండియా కూటమి: తమిళనాడు సీఎం స్టాలిన్

by vinod kumar |
విజయానికి చేరువలో ఇండియా కూటమి: తమిళనాడు సీఎం స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయానికి చేరువలో ఉందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. జూన్ 4వ తేదీన భారతదేశం కొత్త ఉదయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, తదుపరి కార్యాచరణ రూపొందించడానికే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘పదేళ్ల బీజేపీ ఫాసిస్ట్ పాలనను ఓడించి, భారతదేశాన్ని రక్షించడానికి ఏర్పడిన ఇండియా కూటమి ప్రజల అంచనాలను అందుకుంది. విజయానికి అంచున ఉంది’ అని పేర్కొన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తుల సంకీర్ణం, తమను సవాలు చేసేవారు ఎవరూ లేరని భావించిన కూటమి ఇప్పుడు ఎన్నికల రంగంలో భారతీయులందరికీ ఆశాజనకంగా ఉంది. నిరంతర ప్రచారం తో ప్రజా క్షేత్రంలో బీజేపీ సృష్టించిన తప్పుడు చిత్రాలను కూల్చివేసింది. రాబోయే విజయానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి’ అని తెలిపారు. ఇండియా మీటింగ్‌లో తమ పార్టీ తరపున టీఆర్‌బాలు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed