నేడు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం

by Rajesh |
నేడు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వెల్లడైన ఎంపీ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, నేడు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీలు సమావేశం కానున్నారు. మోడీ నాయకత్వాన్ని సమర్ధిస్తూ ఎంపీలు తీర్మానం చేయనున్నారు. పార్లమెంట్ లీడర్‌గా మోడీని ఎన్డీఏ ఎంపీలు ఎన్నుకోనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు కలవనున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి నేతలు ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ముఖ్యనేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. కాగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed