మోడీ మళ్లీ ప్రధాని అయితే నేను గుండు చేయించుకుంటా: ఆప్‌ నేత సోమనాథ్ భారతి

by vinod kumar |
మోడీ మళ్లీ ప్రధాని అయితే నేను గుండు చేయించుకుంటా: ఆప్‌ నేత సోమనాథ్ భారతి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సంస్థలు వెల్లడించాయి. అన్ని సర్వే సంస్థలు దేశంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సోమనాథ్ భారతి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మోడీ మరోసారి ప్రధాని అయితే తాను గుండు గీయించుకుంటానని తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పని రుజువు అవుతాయని, ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ కూటమి గెలవబోతుందని తెలిపారు.

‘ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ సీట్లు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్తాయి. మోడీపై ఉన్న భయం వల్ల ఆయనకు వ్యతిరేకంగా రిజల్ట్ వెల్లడించడానికి ఎవరూ సాహసం చేయలేదు. కాబట్టి జూన్ 4న వాస్తవ ఫలితాల కోసం వేచి చూడాలి. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా భారీగా ఓటు వేశారు’ అని పేర్కొన్నారు. కాగా, సోమనాథ్ భారతి న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా బరిలో నిలిచారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం, కేంద్రంలో ఇండియా కూటమి బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed