‘ఇండియా’ గెలిస్తే.. వారి సిద్ధాంతాలతో పాలన : Akhilesh Yadav

by Vinod kumar |
‘ఇండియా’ గెలిస్తే.. వారి సిద్ధాంతాలతో పాలన : Akhilesh Yadav
X

లక్నో : 2024 లోక్ సభ పోల్స్‌లో ‘ఇండియా’ కూటమి గెలిస్తే.. అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రకారం దేశంలో పాలన సాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒకవేళ ‘ఇండియా’ గెలవకపోతే.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మార్చేసి ఏమేం చేస్తుందో చెప్పలేమని కామెంట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నీరజ్ మౌర్య రాసిన పుస్తకాన్ని లక్నోలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

5 వేల ఏళ్ల క్రితం ఏర్పడిన కుల వ్యవస్థ సమాజంలో అంతరాలను సృష్టించిందని అఖిలేష్ పేర్కొన్నారు. సమాజం చైతన్యవంతమైతే కులాల అడ్డుగోడలు తొలగిపోతాయని, ప్రతి కులం మరో కులానికి అండగా నిలిచే నూతన సంప్రదాయం మొదలవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed