భయంతో వణికి పోయాను : రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
భయంతో వణికి పోయాను : రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భయంకర ఘటనా నన్ను తీవ్రంగా కలచి వేసిందని, కొన్ని క్షణాలు భయంతో వణికి పోయాను అన్నారు. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకూడదని, మహిళల మీద జరిగే అఘాయిత్యాలపై దేశం మొత్తం మేల్కొని, ఇటవంటి దుర్మార్గాలను ఆపేందుకు ముందుకు రావాలన్నారు. కోల్‌కతా ఘటనపై విద్యార్థులు, సామాన్య ప్రజలు ఓవైపు అదోళనాలు చేస్తూ ఉన్నప్పటికీ.. మరోవైపు మహిళలపై లైంగిక దాడులు యథావిధిగా జరుగుతున్నాయని అన్నారు. మహిళలు ప్రతీ ఒక్క హక్కును పోరాడి సంపాదించుకుంటున్నారని, కొంతమంది సామాజిక కట్టుబాట్లకు, ఆచార పద్దతులకు భయపడి, మహిళల హక్కుల విషయంలో తమ తలలను నిప్పు కోడిలా దాచుకుంటున్నారని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా దీనిని ఆపాలని హితవు పలికారు.

Next Story

Most Viewed