Haryana Elections: ఎన్నికల వేళ 13 మంది నేతలను సస్పెండ్ చేసిన హర్యానా కాంగ్రెస్

by S Gopi |
Haryana Elections: ఎన్నికల వేళ 13 మంది నేతలను సస్పెండ్ చేసిన హర్యానా కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా పార్టీ 13 మంది నేతలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులపై పోటీగా ఇండిపెండెంట్లుగా పోటీకి దిగడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. బహిష్కరించిన వారిలో గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌లోకి వచ్చిన పండ్రి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ అభ్యర్థి సజ్జన్ సింగ్ ధూల్ కూడా ఉన్నారు. హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక నోటిఫికేషన్‌లో.. ఈ పార్టీ నేతలు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులపై పోటీ చేయడం ద్వారా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నందున నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. సస్పెండ్ చేయబడిన నేతల్లో గుహ్లా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నరేష్ ధండే, ప్రదీప్ గిల్(జింద్), సజ్జన్ సింగ్ ధుల్(పండ్రి), సునీతా బట్టన్(పండ్రి), రాజీవ్ మమురం గోండార్(నీలోఖేరి), దయాల్ సింగ్ సిరోహి(నీలోఖేరి) ఉన్నారు. విజయ్ జైన్(పానిపట్ రూరల్), దిల్బేగ్ శాండిల్(ఉచన కలాన్), అజిత్ ఫోగట్(దాద్రీ), అభిజీత్ సింగ్(భివానీ), సత్బీర్ రాటేరా(బవానీ ఖేరా), నీతు మన్(ప్రథ్లా), అనితా ధుల్(కలయత్) ఉన్నారు.

Advertisement

Next Story