- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Home > జాతీయం-అంతర్జాతీయం > భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు
భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్డెస్క్: రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్పై సిమెంట్ దిమ్మెను అమర్చారు. వేగంగా వచ్చిన ఓ రైలు ఆ సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతిన్నది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులకు కావాలనే ఎవరో కుట్ర చేశారని అనుమానిస్తున్నారు. ఈ కుట్రలో ఒకరి కంటే ఎక్కుమంది ప్రమేయం ఉందని అంచనా వేశారు. గత రెండ్రోజుల క్రితం కాన్పూర్లో ఇదే తరహా కుట్ర జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story