ఢిల్లీలో కుప్పకూలిన పురాతన భవనం

by M.Rajitha |
ఢిల్లీలో కుప్పకూలిన పురాతన భవనం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ పురాతన భవనం కుప్ప కూలిపోయింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతుండగా... శనివారం తెల్లవారుజామున కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వాయువ్య ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గల రెండస్తుల పురాతన భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. సుమారు వందేళ్ల కిందటిదిగా భావిస్తున్న ఈ భవనానికి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారని, మరమ్మత్తులు జరుగుతుండగానే భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. భవనం శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని వెలికి తీసి ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా భవన యాజమనిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed