జవాన్ల మధ్య గొడవ.. కాల్పుల్లో ఒకరి మృతి

by M.Rajitha |
జవాన్ల మధ్య గొడవ.. కాల్పుల్లో ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గడ్ (Chatthisghad) రాష్ట్రంలో జవాన్ల మధ్య నెలకొన్న వివాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్ లోని బూతాహి పోలీస్ క్యాంపులో సీఏఎఫ్(CAF) ఆర్మ్ ఫోర్స్ కు చెందిన జవాన్ల మధ్య చిన్న ఘర్షణ తలెత్తింది. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి, తీవ్ర గొడవకు దారితీసింది. కోపోద్రేక్తుడయిన ఓ జవాన్ తన తోటివారిపై కాల్పులకు పాల్పడగా అక్కడికక్కడే ఒక జవాన్ మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed