కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఈ నాలుగు రాష్ట్రాలకు భారీ గుడ్ న్యూస్

by Mahesh |
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఈ నాలుగు రాష్ట్రాలకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఈ రోజు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో మొదటగా ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం మొదటి దశ నిర్మాణం కోసం రూ. 12,500 కోట్ల విడుదల కు ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ, తెలంగాణ, బిహార్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో మొత్తం రూ. 25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్‌లను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పైన తెలిపిన రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగు పడనున్నాయి.

Advertisement

Next Story