- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నీట్ పేపర్ లీకేజీ కేసు.. గుజరాత్ లోని ఏడు చోట్ల సీబీఐ సోదాలు
![నీట్ పేపర్ లీకేజీ కేసు.. గుజరాత్ లోని ఏడు చోట్ల సీబీఐ సోదాలు నీట్ పేపర్ లీకేజీ కేసు.. గుజరాత్ లోని ఏడు చోట్ల సీబీఐ సోదాలు](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347230-cbi.webp)
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ సోదాలు చేపట్టింది. గుజరాత్ లోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆనంద్, ఖేడా, అహ్మాదాబాద్, గోద్రా జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ లోని హజారీబాగ్ లోని ఒయాసిస్ స్కూల్ కి చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఓ హిందీ పేపర్ జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు.
మొత్తం 6 ఎఫ్ఐఆర్ లు
నీట్ పేపర్ లీక్ కేసులో మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా, దర్యాప్తు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో మిగితా కేసులు నమోదు అయ్యాయి. బిహార్, గుజరాత్ల నుంచి ఒక కేసు దర్యాప్తు జరగ్గా, రాజస్థాన్లో మూడు కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది.