BREAKING : లోక్‌సభ స్పీకర్‌గా రెండో సారి ఓం బిర్లా ఎన్నిక

by Rajesh |   ( Updated:2024-06-26 06:05:04.0  )
BREAKING : లోక్‌సభ స్పీకర్‌గా రెండో సారి ఓం బిర్లా ఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. భారతదేశ 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి కే. సురేష్‌పై ఓంబిర్లా గెలుపొందారు. రెండో సారి లోక్ సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటు ద్వారా ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రాజస్థాన్ లోని కోటా నుంచి ఎంపీగా ఓంబిర్లా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని కోట నుంచి మూడుసార్లు ఓంబిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. ఓంబిర్లాను సభాపతి స్థానంలో ప్రధాని మోడీ, కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొబెట్టారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ తరఫున కూడా ఓంబిర్లాకు శుభాభినందనలు తెలుపుతున్నా అని మోడీ అన్నారు. వచ్చే ఐదేళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed