Diesel thieves : రోడ్డు పై నిలిచిన లారీలు.. 900 లీటర్ల డీజిల్ అపహరణ..

by Sumithra |
Diesel thieves : రోడ్డు పై నిలిచిన లారీలు.. 900 లీటర్ల డీజిల్ అపహరణ..
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి ( Sattupalli ) జె.వి.ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పై ఆగి ఉన్న మూడు లారీల తాళాలు పగలగొట్టి సుమారు 900 లీటర్ల డీజిల్ ( Diesel ) అపహరించిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డెక్కన్ సిమెంట్ కంపెనీకి ( Deccan Cement Company ) చెందిన మూడు లారీలు వైజాగ్ నుంచి బొగ్గు లోడుతో హైదరాబాద్ వెళ్తున్నాయి. అర్ధరాత్రి కావటంతో కాసేపు నిద్రించేందుకు డ్రైవర్లు సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారి ( main road ) పక్కన నిలిపారు.

డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ ట్యాంక్ ల తాళాలు పగలగొట్టి మూడు లారీలలో సుమారు 900 లీటర్ల డీజిల్ ను అపహరించారు. డీజిల్ చోరీకి గురైన విషయాన్ని డ్రైవర్లు తెల్లవారుజామున గుర్తించారు. ఒక్కొక్క లారీలో సుమారు 30 వేల రూపాయల విలువ గల 300 లీటర్ల డీజిల్ ను దొంగిలించారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed