ప్రసవించిన వెంటనే శిశువు మృతి..కొద్ది సేపటికే..

by Sridhar Babu |   ( Updated:2024-10-26 10:05:44.0  )
ప్రసవించిన వెంటనే శిశువు మృతి..కొద్ది సేపటికే..
X

దిశ, ములకలపల్లి : పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి (Palvancha Hospital)లో విషాదం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పాపతో పాటు తల్లి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాత గంగారాం గ్రామానికి చెందిన గిరిజన యువతి పోడియం మోతి (22 ) పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి తల్లి, శిశువు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం పురిటి నొప్పులతో మోతీ బాధపడుతుండగా స్థానిక ఆశా కార్యకర్త ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పాల్వంచ తీసుకొచ్చారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు తిరిగి ఇంటికి పంపించారు. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్ర చికిత్స (Surgery)ద్వారా కాన్పు చేశారు. కానీ శిశువు మృతి చెందింది. అప్పటికి తల్లి క్షేమంగానే ఉంది. కొద్ది సేపటి తరువాత మోతికి వైద్యులు ఇంజక్షన్ చేయడంతో ఆమె పరిస్థితి విషమించింది. పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్తానని భర్త దినేష్ (Dinesh)వైద్యులను కోరారు. ఐనా వినకుండా వైద్యం చేయడంతో ఆమె సాయంత్రం మృతి చెందిందని ఆయన తెలిపారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, శిశువు మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story