నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జీలను ప్రకటించిన బీజేపీ

by Vinod kumar |
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జీలను ప్రకటించిన బీజేపీ
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జీలను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. తెలంగాణకు ప్రకాశ్ జావడేకర్, మధ్యప్రదేశ్‌కు భూపేంద్ర యాదవ్, రాజస్థాన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఛత్తీస్‌గఢ్‌కు ఓం ప్రకాశ్ మాథుర్‌లను ఎన్నికల బాధ్యులుగా నియమించింది. వీరికి కో-ఇంఛార్జీలను కూడా నియమించింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను కూడా బీజేపీ మార్చింది. తర్వాత కొద్ది రోజులకే ఎన్నికల ఇంఛార్జీలను ప్రకటించడం విశేషం.

తెలంగాణ:

ప్రకాశ్ జావదేకర్ - ఎన్నికల ఇంఛార్జి

సునీల్ బన్సల్ - కో-ఇంఛార్జి

రాజస్థాన్:

ప్రహ్లాద్ జోషి - ఎన్నికల ఇంఛార్జి

నితిన్ పటేల్ - కో-ఇంఛార్జి

కుల్దీప్ బిష్ణోయ్ - కో-ఇంఛార్జి

ఛత్తీస్‌గఢ్:

ఓం ప్రకాశ్ మాథుర్ - ఎన్నికల ఇంఛార్జి

మనుష్ఖ్ మాండవియా - కో-ఇంఛార్జి

మధ్యప్రదేశ్:

భూపేంద్ర యాదవ్ - ఎన్నికల ఇంఛార్జి

అశ్వినీ వైష్ణవ్ - కో-ఇంఛార్జి

Advertisement

Next Story

Most Viewed