Ayodhya : అయోధ్యలో వందల కోట్ల భూకుంభకోణం : అఖిలేష్ యాదవ్

by Hajipasha |
Ayodhya : అయోధ్యలో వందల కోట్ల భూకుంభకోణం : అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలో బీజేపీ వందల కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆ స్కాంలో బీజేపీ నేతలు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో అఖిలేష్ ఈ ఆరోపణలు చేశారు. పవిత్ర భూమి అయిన అయోధ్య గడ్డపై భూదోపిడీ జరుగుతుండటం దారుణ విషయమని విమర్శించారు.

అయోధ్యలోనే ఇంతలా భూకుంభకోణం జరుగుతుంటే.. యూపీలోని ఇతర జిల్లాల్లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. యూపీ సర్కారు అయోధ్యలోని పేదల భూమిని లాక్కొని ఇతరులకు కట్టబెట్టిందని అఖిలేష్ పేర్కొన్నారు. చివరకు రక్షణశాఖకు చెందిన భూమిని కూడా బీజేపీ ప్రభుత్వం అమ్మేసిందన్నారు. అవినీతిని సహించని ప్రభుత్వమంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed