Air India :ఎయిర్ఇండియా గుడ్ న్యూస్.. పలు కొత్త మార్గాలలో సర్వీసులు ప్రారంభం

by Maddikunta Saikiran |
Air India :ఎయిర్ఇండియా గుడ్ న్యూస్.. పలు కొత్త మార్గాలలో సర్వీసులు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ఇండియా (Air India) తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి పలు కొత్త మార్గాలలో విమాన సర్వీసులు ప్రారంభించింది. వీటిలో విజయవాడ-బెంగళూరు, హైదరాబాద్-గౌహతి, బెంగళూరు-ఇండోర్ ఉన్నాయి.వీటిని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం కోసం NDA ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. ఇలాంటి నేరుగా విమానాలు వృత్తిపరులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, విజయవాడ పరిసర ప్రాంతాల ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడతాయని కేంద్రమంత్రి చెప్పారు. టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎయిర్ ఇండియా చేస్తున్న కృషికి తాను అభినందిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed