- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఫస్ట్ నైట్ రోజు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడిన వధువు.. ఆసుపత్రికి తీసుకెళ్లగానే సీన్ రివర్స్!
దిశ, ఫీచర్స్ : మధ్య ప్రదేశ్లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్కు గురి చేసింది. ఈ మధ్య పెళ్లీలలో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పెళ్లీలు ఆగిపోతున్నాయి. కొన్ని పెళ్లీలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోగా, మరి కొన్ని తాళికట్టి రెండు మూడు రోజుల తర్వాత కొన్ని విషయాల తెలుసుకొని బంధాన్ని అక్కడికే క్లోజ్ చేస్తున్నారు. ఇక తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన అందరిని షాక్కు గురి చేసింది. పెళ్లైన రెండు రోజులకు వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అసలు విషయంలోకి వెళితే.. ఓ యువతికి మే 20న వివాహం జరిగింది. అయితే రెండు రోజుల తర్వాత ఆమెకు కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాట్లు చేశారు. ఇక మొదటి రోజు అయిపోయిన తెల్లవారు జామున ఆమె విపరీతమైన కడుపు నొప్పితో బాధపడింది. దీంతో తన భర్త, అత్తమ్మ, మామయ్యలు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె నిండు గర్భిని అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయంపై నవ వధువును మందలించగా తానూ పూర్తి సమాచారం తెలిపింది. సరాయ్ గ్రామానికి చెందిన సునీల్ భాఘెల్ తనను ప్రేమిస్తున్నానంటూ. శారీరకంగా సన్నిహితంగా మెదిలి తర్వాత మోసం చేశారని పేర్కొంది. పెళ్లి పేరుతో ఆమెను తమ పొలం వద్దకు రమ్మని, ఆత్చాచారం చేశారని పేర్కొంది. అంతే కాకుండా తాను గర్భవతిని అని తెలుసు. ఈ విషయం సురేష్కు చెప్పినా పట్టించుకోలేదంటూ తెలిపింది. దీంతో నవ వధవు కుటుంబ సభ్యులు సునీల్పై పోలీసులుకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.