తమిళనాడు హాస్టల్‌లో ఆహారం తిని ఆసుపత్రి పాలైన 42 మంది కాలేజీ విద్యార్థులు

by S Gopi |
తమిళనాడు హాస్టల్‌లో ఆహారం తిని ఆసుపత్రి పాలైన 42 మంది కాలేజీ విద్యార్థులు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కారణంగా 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఈరోడ్‌లో ఉన్న కాలేజీకి చెందిన విద్యార్థులు శనివారం రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత అసౌకర్యానికి గురయ్యారు. ఆహారం తిన్న తర్వాత చాలామంది విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారని, కొద్దిసేపటికి వాంతులు కూడా చేసుకున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు పేర్కొన్నారు. విద్యార్థులందరినీ ఈరోడ్‌లోని జిల్లా మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విధ్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story