వాళ్ల మాటలు ఎవరూ నమ్మకూడదు

by  |
వాళ్ల మాటలు ఎవరూ నమ్మకూడదు
X

దిశ, నారాయణఖేడ్: దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి మండల కేంద్రంలో మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయం అన్నారు.

ప్రతిపక్షాల మాటలు ఎవరూ నమ్మకూడదని తెలిపారు. నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత అబివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్ నిలబెట్టే అభ్యర్థిని గెలిపించాలని నాయకులకు సూచించారు.


Next Story

Most Viewed