భద్రాద్రిలో నేటి నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

by Shyam |
భద్రాద్రిలో నేటి నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి రామాలయంలో నేటి నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు రోజుకో అలంకారంలో స్వామివారు భక్తులు దర్శనమివ్వనున్నారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా నేడు సీతారామచంద్రుడు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన స్వామివారి తెప్పోత్సవం జరగనుంది. 25వ తేదీన శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 25 వరకు నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed