సంజీవని ఇండస్ట్రీస్‌ను ప్రారంభించిన ఎంపీ అర్వింద్

by Sridhar Babu |
MP-Aravindh1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన సంజీవని ఇండస్ట్రీస్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించారు. శనివారం కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా ఎంఎస్ఎంఈ కింద ఖానాపూర్ శివారులో రూ. కోటి 11 లక్షల తో నిర్మించిన టర్మరిక్ యూనిట్ ని, ఇడ్లీ రవ్వ యూనిట్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీస్ అధినేత లింగంపల్లి లింగం, బీజేపీ నాయకులు ధన్ పాల్ లక్ష్మి నారాయణ, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story