- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ వేడికి కేసీఆర్, కేటీఆర్లకు నిద్రపట్టడంలేదు: ఎంపీ అర్వింద్
by Anukaran |
X
దిశ, తెలంగాణ బ్యూరో: దళితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, ఆయన కూర్చున్న కుర్చీ దళితుడిదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్లో వేడిపెరుగుతోందని, ప్రగతి భవన్లో కేసీఆర్, కేటీఆర్లకు నిద్రపట్టడం లేదన్నారు. ఏం చేయాలో తెలియక అయ్యా కొడుకు పరేషాన్ అవుతున్నారని చురకలు వేశారు. తాగి ఒకరు.. మత్తు పదార్థాలు తీసుకొని మరొకరు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దళితుడుని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. హుజూరాబాద్లో గెలిచేది బీజేపీయేనని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
Next Story