Trivikram: ఏపీ, తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్-పవర్ స్టార్ ప్రొడ్యూసర్స్

by Anjali |
Trivikram: ఏపీ, తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్-పవర్ స్టార్ ప్రొడ్యూసర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సంయుక్తంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడితో పాటుగా నిర్మాతలు రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణ 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయని వెల్లడించారు. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ తమ వంతు సాయంగా చేయూత అందిస్తున్నామని సోషల్ మీడియా వేదికన ప్రకటించారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల ప్రజల్ని ఆదుకునేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed