- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఎన్నికల రిజల్ట్స్ : గెలుపు దిశగా అడుగులు వేస్తున్న నటీనటులు వీరే!
దిశ, సినిమా : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా నేడే రానున్నాయి. దీంతో అందరి దృష్టి రిజల్ట్స్ మీద ఉంది. మరీ ముఖ్యంగా ఈ సారి చాలా మంది సెలబ్రిటీస్ ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో తమ అభిమాన నటీనటులు గెలుస్తారా? లేదా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి అభిమాన తారలు గెలవాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల బరిలో సినీ సెలబ్రిటీలు.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, హేమమాలిని, రవి కిషన్, సురేశ్ గోపీ, మనోజ్ తివారీ. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ, రోజా ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం వీరిలో కొందరు లీడ్లో కొనసాగుతున్నట్లు సమాచారం.
బీజేపీ తరఫున మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగిన కంగనా 20,745 ఓట్ల అధిక్యంలో కొనసాగగా, మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న హేమమాలిని,19000ల ఓట్లతో, మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నుంచి 18,122, సురేశ్ గోపీ 10,142, రవి కిషన్, గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఏపీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ అధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రోజా వెనకంజలో ఉన్నట్లు సమాచారం.