‘కల్కి’ టికెట్ల కోసం ఎగబడ్డ ప్రభాస్ ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్..!

by Jakkula Mamatha |   ( Updated:2024-06-27 04:49:07.0  )
‘కల్కి’ టికెట్ల కోసం ఎగబడ్డ ప్రభాస్ ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్..!
X

దిశ,వెబ్‌డెస్క్: యావత్ భారతదేశం అంతా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి’ 2898 ఏడీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిన ఈ చిత్రం పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పదుకొన్‌, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. 40 ఏళ్ల విరామం తర్వాత అమితాబ్‌, కమల్‌హాసన్‌ కలిసి ఈ సినిమాలో కనిపించారు.

కల్కి ఫీవర్ ఎలా ఉంటుందో టికెట్ల బుకింగ్‌ లోనే తెలిసింది. మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుందని తెలిసిన ప్రభాస్‌ ఫ్యాన్స్ రాత్రి నుంచే థియేటర్ల ముందు మకాం వేశారు. ఎప్పుడెప్పుడు ప్రీమియర్‌ షో పడుతుందా లోపలికి వెళ్లి మూవీ చూద్దామా అని ఎంతో ఆత్రుతతో ఉన్నారు. బెనిఫిట్‌ షో లకు అభిమానులు పోటెత్తడంతో థియేటర్ల ముందు పోలీసులకు వారిని కంట్రోల్‌ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌లో ఓ థియేటర్‌ వద్ద అభిమానులు మితీమిరి ప్రవర్తించడంతో పోలీసులు ప్రభాస్‌ అభిమానుల మీద లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed