వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్

by sudharani |   ( Updated:2024-10-04 15:50:04.0  )
వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. మొదటి షో నుంచి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. కలెక్షన్లు మాత్రం భారీగానే రాబడుతోంది. అంతే కాకుండా తాజాగా దేవర రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఇక ‘దేవర’ ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భంగా తాజాగా చిత్ర బృందం స‌క్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా.. ఎన్టీఆర్, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, అనిరుధ్ రవిచందర్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాశ్ రాజ్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఎంతో కోలాహలంగా, హట్టహాసంగా అభిమానుల అందరితో జరుపుకోవాల్సిన ఒక విజయోత్సవ సభ ఇది. దేవినవరాత్రులు ఉండటంతో సెక్యూరిటీ కొంచెం దృష్టిలో పెట్టుకుని పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసుల నిర్ణయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లు డ్యూటీ చేసేది మనకోసం. అందుకే ఇలా చిన్నగా కావాల్సినటువంటి యూనిట్ సభ్యులతో, డిస్టిబ్యూటర్లతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోంది. ముందుగా ఇంతటి భారీ విజయాన్ని అందించినటువంటి ప్రేక్షకదేవళ్లు అందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఎన్టీఆర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed