ప్రాణం పోయే స్టేజ్‌లో రొమాంటిక్ సీన్ షూట్ చేశారు.. జాన్వీ షాకింగ్ కామెంట్స్ !

by Jakkula Samataha |   ( Updated:2024-05-30 10:59:58.0  )
ప్రాణం పోయే స్టేజ్‌లో రొమాంటిక్ సీన్ షూట్ చేశారు.. జాన్వీ షాకింగ్ కామెంట్స్ !
X

దిశ, సినిమా : జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అతిలోక సుందరి గారాల పట్టిగా చిత్ర పరివ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది, తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఇక ప్రస్తుంతం ఈ బ్యూటీ రాజ్ కుమార్ రావుతో నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ అనే సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీ అయిపోయింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీ తన అభిమానులతో షూటింగ్ ఎక్స్ పీరియన్స్‌ను పంచుకుంది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

జాన్వీ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ చేయడం అనేది కాస్త కష్టంతో కూడుకున్నది.ముఖ్యంగా రాజ్ కుమార్ రావుతో కలిసి ఓ కిస్ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మేము చాలా అలసిపోయాము. 20 గంటల తర్వాత ఆ షిఫ్ట్ జరిగింది. నిజానికి అప్పటికీ మేము ఇద్దరం పూర్తిగా అలసిపోయాం. షూటింగ్ చేసి కష్టపడి చచ్చిపోయాం. అయినా మేము అప్పుడు కూడా స్క్రీన్ పై అప్పుడే ప్రేమలో పడి జంటలా.. అప్పుడే ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న కపుల్‌లాగా కనిపించాలి. కానీ నిజానికి మేము అప్పటికే అలసటతో ప్రాణం పోయేంత స్టేజ్‌లో ఉన్నాం అని జాన్వీ కపూర్ గుర్తుచేసుకుంది. ప్రస్తుం జాన్వీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed