ప్రభాస్ కారణంగా ప్రతీ రోజు ఏడ్చేదాన్ని.. నరకం అనుభవించాను : స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Kavitha |
ప్రభాస్ కారణంగా ప్రతీ రోజు ఏడ్చేదాన్ని.. నరకం అనుభవించాను : స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ‘అలా మొదలైంది’ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన నిత్యా మీనన్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం‌తో ఈ భామకు టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఒప్పుకోకుండా కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఈ అమ్మడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలొనూ యాక్టీవ్‌గా ఉండట్లేదు ఈ బ్యూటీ.

ఇదిలా ఉండగా.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ ప్రభాస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అందులో భాగంగా ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెకు నేటి తరం స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా తెలియదట. ఒకసారి ఆమె ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు ప్రభాస్ గురించి ఒక ప్రశ్న అడిగితే, ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని చెప్పిందట. ఆమె అలా మాట్లాడడంతో మీడియాలో నిత్యామీనన్ మీద ఇష్టమొచ్చిన కథనాలు ప్రచురితం అయ్యేవి అట. ఇక అవి చూసి ప్రభాస్ అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ల్స్ చేసేవారట. ఆ ట్రోల్స్ చూసి నిత్యామీనన్ ఏడవని రోజు లేదట.

అయితే కేరళలో పుట్టి పెరిగిన నిత్యామీనన్‌కి మన టాలీవుడ్ నుండి కేవలం చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మరియు అల్లు అర్జున్ మాత్రమే తెలుసట. తనకు తెలిసిన విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పినందుకు నన్ను ఇంతలా వేధిస్తారా అని అప్పట్లో నిత్యా మీనన్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిన సందర్భం కూడా ఉందట. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ముక్కుసూటి తనాన్ని వదులుకోనని, నా మనసులో ఏది ఉంటే అదే చెప్తాను అంటూ అప్పట్లో నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed