జాన్వీ కపూర్ పై ఫ్యాన్స్ ఫైర్.. అసలేమైదంటే?

by Jakkula Samataha |
జాన్వీ కపూర్ పై ఫ్యాన్స్ ఫైర్.. అసలేమైదంటే?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది మదిని మాయచేస్తోంది. బాలీవుడ్ లో తన నటన, గ్లామర్‌తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ నటి వరస సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమా త్వరలో విడుదల కానుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగ ఉంది. పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమైపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. ఆమె మూవీ గురించి మాట్లాడుతూ తన పర్సనల్ విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన పెళ్లి గురించిన వార్తలపై ఓపెన్ అయ్యింది. జాన్వీ మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ పుడ్ అంటే ఇష్టమని, అమ్మ చనిపోయిన తర్వాత శుక్రవారం బ్లాక్ డ్రెస్ వేసుకోవడం మానేశాను, జాతకాలు ఎక్కువగా నమ్ముతాను, పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. కానీ మీడియాలో నాకు పదే పదే పెళ్లి చేస్తున్నారు. నేను కెరీర్పై ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనిపై తన అభిమానులు ఫైర్ అవుతున్నారు. శిఖర్ ప్రహరీయతో జంటగా తిరగడం ఒకే కానీ పెళ్లి ఇంట్రెస్ట్ లేదా అంటూ మండిపడుతున్నారు. ఇక జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed